Chitram news
Newspaper Banner
Date of Publish : 09 August 2025, 1:51 am Editor : Chitram news

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న సాయినాథ్ 

రక్తదానం చేస్తున్న సాయినాథ్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హల్ద గ్రామానికి చెందిన సాయినాథ్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. భైంసా సాయి సుప్రియ  హాస్పిటల్ లో శశికళ అనే మహిళ పేషంట్ కు B+ రక్తం అవసరం ఉందని తెలుసుకున్న వెంటనే, రక్తదానం చేయడానికి సాయినాథ్ ముందుకు వచ్చాడు. ఆయన మాట్లాడుతూ..రక్తదానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు, ఇలాంటి సంఘటనలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయి.ఇది సామాజిక బాధ్యతను, మానవత్వాన్ని చాటిచెప్పే ఒక గొప్ప అవకాశం వచ్చిందన్నారు.