Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

*తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు

*ప్రధాని గారి చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా జరుపుకుంటున్నం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మావలలోని రత్న గార్డెన్స్ లో గురువారం తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 6 వ యోగా పోటీలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన యోగ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతు.. రాష్ట్ర స్థాయి పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. యోగాను ప్రతి ఒక్కరు సాధన చేయాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, నాయకులు విజయ్ బోయర్, లాలా మున్నా, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments