రిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావ్ నివాసంలో జరిగిన గ్యాస్ ప్రమాదంలో గాయపడి ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 గురు పేషంట్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో మాట్లాడి అందరికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. వీరి వెంట సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ స్వామి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, తిరుమల్ గౌడ్, శ్రీరామ్ నాయక్, చంద్రమోహన్, కేదారేశ్వర్ రెడ్డి, ఇఫ్తేకార్ తదితరులు ఉన్నారు.