బోథ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలకు ఆత్మీయ సన్మానం
చిత్రం న్యూస్, బోథ్ : జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని స్థానిక మార్కండేయ గుడి ఆలయంలో బోథ్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలను సన్మానించారు. గతంలో బోథ్ పట్టణం నుంచి భీవండి ,ముంబయి వెళ్లి అక్కడ రాట్నం, మగ్గాలు పై నేత పని చేసి తిరిగి బోథ్ లో స్థిర పడిన నేతన్నలకు, విశ్రాంత ఉపాధ్యాయుడు దీకొండ సత్యనారాయణకు శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, చేనేత కార్మికులు సబ్బని నర్సయ్య, లక్క వత్తుల నారాయణ. తాటికొండ రాజేశ్వర్. గుండు మల్లేష్. కటకం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

