పాఠశాలలో బాలురకు రాఖీలు కడుతున్న బాలికలు
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భైంసా మండలం వాలేగాం గ్రామం పాఠశాలల్లో రక్షాబంధన్ పండగను ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మన్,ఉపాధ్యాయులు సోనియా, డీ.రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి పోతన్న ,దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ వారి చేతుల మీదగా రాఖీలు విద్యార్థులకు కట్టించారు. అనంతరం ఉపాధ్యాయురాలు సోనియా మాట్లాడుతూ..రాఖీ బంధం అనేది విద్యార్థులతో స్నేహం, సోదర, సోదరి భావం ఐక్యతను పెంపొందించడానికన్నారు. రాఖీ కట్టుకోవడం, బహుమతులు పంచుకోవడం ద్వారా విద్యార్థుల మధ్య స్నేహానుబంధం పెరుగుతుందన్నారు. ఈ పండగ యొక్క ప్రాముఖ్యత, సాంస్కృతిక విలువలను విద్యార్థులు తెలియజేయడం ఎంతైనా ఆవశ్యకత ఉందన్నారు. మహేష్ మాట్లాడుతూ.. రాఖీ పండగ అనేది ” నీకు నేను రక్ష,నాకు నీవు రక్ష ” మనమందరం దేశాన్ని రక్షణ వంటి నినాదంతో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలన్నారు. రాఖీ పండగ సంబంధించిన పాటలు పాడారు. నృత్యాలు, నాటకాలు ప్రదర్శించారు.