Chitram news
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 12:44 pm Editor : Chitram news

ఆర్డీవో ను కలిసిన బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బొడ్డు గంగారెడ్డి 

ఆర్డీవో ను కలిసిన బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బొడ్డు గంగారెడ్డి 

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ,నేరడిగొండ గ్రామాలలో వ్యవసాయదారులు పండించిన పంటలని కొనుగోలు చేయడం వీలుగా  సబ్ మార్కెట్ యార్డ్  కోసం స్థల సేకరణ చేసి ఇవ్వాలని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి  ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతిని కోరారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఆమెను కలిసి విన్నవించారు. సబ్ మార్కెట్ ఏర్పాటైతే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని ఆమె తెలిపారన్నారు. అనంతరం శాలువాతో సత్కరించారు.