ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్
*అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు
*భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ
*ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్
చిత్రం న్యూస్, భైంసా: ఆధార్ కార్డు అప్డేట్ లేదని ఫ్రీ టికెట్ ఇవ్వని విషయంలో అరగంట పాటు పంచాయతీ జరిగిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. భైంసా – నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దాదాపు 20 మంది మహిళలు ప్రయాణించగా, ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ అడిగిన మహిళలకు, ఆధార్ కార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందని, ఆ మహిళలకు కండక్టర్ టికెట్ ఇవ్వలేదు.
దీంతో భైంసా మండలం దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి కండక్టర్ తో మహిళను గొడవకు దిగారు. అరగంటసేపు బస్సు రోడ్డు మీద నిలిచి ఉన్నందున తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని మహిళలను బస్ లో పంపించారు. గొడవ సద్దు మణిగింది.

