ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో సొనాల మండల కాంగ్రెస్ నాయకులు
చిత్రం న్యూస్, సొనాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలోపాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. ఈతామెంతో తమకంతా అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకుండా బీసీలను మోసం చేస్తున్నందుకుగాను అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ నడిగడ్డ పైన జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో పాల్గొననున్నామని తెలిపారు. కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, పట్టణ అధ్యక్షులు అనిల్, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కసిరి పోతన్న, మాజీ సర్పంచ్ వినోద్ పాల్గొన్నారు.
