రిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న ఆత్రం సుగుణక్క, బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, రిమ్స్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పిప్పల్ ధరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావు ఇంట్లో ఆదివారం సాయంత్రం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆరుగురికి గాయాలయ్యాయి .సోనేరావు తో సహా మరో అయిదుగురు తొడసం లక్ష్మణ్, బాపురావు, షేర్రావు, గంగాప్రసాద్, మహేష్ లను రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవలను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునిల్ జాదవ్, మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్ర శేఖర్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, పరంకుశం వెంకటేష్ తదితరులు ఉన్నారు.

