ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి విరాళం అందజేస్తున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విరాళం
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో ప్రజలు, యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేస్తున్నందున నిర్మాణం కొరకు తమ వంతు విరాళంగా రూ.31వేల ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదిలాబాద్ ఇంచార్జ్ బోస్లే బాజీరావు కార్య నిర్వాహకులకు మంగళవారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా బోస్లే బాజీరావు మాట్లాడుతూ…భైంసా డివిజన్లోని ప్రజలు, యువకులు, నాయకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని ఆయన విగ్రహాలు పెట్టడం వారిలో చైతన్యానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. కలగళ్ల యువకులను ఆదర్శంగా తీసుకొని. ప్రతి గ్రామంలోనూ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడం కోసం అందరూ ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

