Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే రామారావ్ పటేల్

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రామారావ్ పటేల్

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా సాగు నీటిని మంగళవారం ఎమ్మెల్యే పీ.రామారావ్ పటేల్ విడుదల చేసారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో నిండక పోయినప్పటికీ ప్రస్తుతం వరి నాట్ల సమయం కావడం తో రైతుల సమస్య ను దృష్టిలో ఉంచుకోని నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. వాలేగాం, కుంసర్, కామోల్, పుస్పూర్ తో పాటు పలు గ్రామాల రైతులకు నీటి విడుదల వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్ట్ లు చెరువు లు నిండి పంటలు పండాలని అయన ఆకాంక్షించారు. కార్యక్రమం లో ప్రాజెక్ట్ ఈఈ అనిల్,మాజీ ఎంపీపీ రజాక్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్ రావ్ పటేల్ , పీఏసీఎస్  డైరెక్టర్ వడ్నపు శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, నాయకులు రావుల పోశెట్టి, పండిత్ రావ్ పటేల్, తుమొల్ల దత్తాత్రి, అనిల్ తో పాటు ముధోల్, లోకేశ్వరం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments