Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ఔట్ సోర్సింగ్ సిబ్బంది మెమోరండం అందజేత 

బోథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనురాధకు మెమోరండం అందజేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న నలుగురు సిబ్బంది సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధకు మెమోరండం సమర్పించారు. గత (5) నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పైఅధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో విధులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు. మెమోరండం సమర్పించిన వారిలో కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ శృతి, ఆఫీస్ సబార్డినేటర్ సవిత, నైట్ వాచ్మెన్ రమేష్ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments