Chitram news
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 1:08 pm Editor : Chitram news

బోగస్ పింఛన్లను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానం

పోస్టాఫీసులో ఫేస్ రికగ్నిషన్ విధానంలో  పింఛను అందజేస్తున్న దృశ్యం

చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణలో పింఛన్ల పంపిణీలో ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా, పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు తీసుకునే వారికి ఈ విధానం వర్తిస్తుంది. దీని ద్వారా వేలిముద్రలు సరిగా పడని లబ్ధిదారులకు కూడా సులభంగా పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇది ఒక సాంకేతికత, దీని ద్వారా ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తించి, వారిని ధృవీకరించవచ్చు. ఈ విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో మోసాలను అరికట్టవచ్చు. వేలిముద్రలు సరిగా పడని వ్యక్తులు, ముఖ్యంగా వృద్ధులు, ఈ విధానం ద్వారా సులభంగా పింఛన్లు పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో తపాలా కార్యాలయాల ద్వారా పింఛన్లు ఈ విధానం ద్వారా బోగస్ పింఛన్లను గుర్తించి, అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు అందేలా చూడవచ్చని బీపీఎం భోజన్న పేర్కొన్నారు.