Chitram news
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 12:10 pm Editor : Chitram news

బేల పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేక  రైతులకు ఇబ్బంది

బేల పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేక  రైతులకు ఇబ్బంది

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని ఎమ్మార్పీఎస్ బేల మండల అధ్యక్షుడు అంకుష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బేల లోని పశువైద్యశాలలో ప్రస్తుతం వైద్య సిబ్బంది లేరు. మార్గదర్శక వనరులు, ఔషధాల కొరత, అధునాతన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు  తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అతివేగంగా వ్యాపించే పశువుల వ్యాధులకు చికిత్స లేకపోవడం వల్ల పశు సంపద నష్టపోతుందని, రైతులకు ఆర్థికంగా భారమవుతోందన్నారు.శాశ్వత వైద్యుడు లేక, అత్యవసర చికిత్సా సామగ్రి, ప్రాథమిక ల్యాబ్, నిర్దిష్ట ఔషధ నిల్వలు ఈ సేవలు లేకుండా పశువైద్యశాల నామమాత్రంగా ఉందన్నారు.  పూర్తిస్థాయిలో పశువైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలని  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో,రమేష్, అంకుష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.