బీజేపీలో చేరుతున్న సామ నర్సింగ్ రెడ్డి కి కండువా కాప్పుతున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన నాయకులు సామ నర్సింగ్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, పార్లమెంట్ కో కన్వీనర్ మయూర్ చంద్ర, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, జిల్లా నాయకులు సామ రమేష్ రెడ్డి ఎల్టి అశోక్ రెడ్డి, గంగం రాంరెడ్డి, సూర్యరెడ్డి, పొచ్చన్న, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
