బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షురాలిగా మంజుల దేశ్ పాండే, . ఉపాధ్యక్షురాళ్లుగా ఉమా బొందిడి, కవిత దేశ్ పాండే, కోశాధికారిణి గా బొర్ర నాగజ్యోతి, కార్యదర్శి గా విజయ దేశ్ పాండే ఎంపికయ్యారు. అలాగే సంఘానికి సలహాదారులుగా పుష్ప దేశ్పాండే, అంతుభట్ల శ్రీదేవి, నమలికొండ శ్రీదేవి, ఎలకూచి దీప, అంతుభట్ల జాహ్నవి, N భావన ఎన్నికయ్యారు. అలాగే న్యాయ సలహాదారులుగా శ్రీ వామనరావు దేశ్ పాండే, శ్రీ మోహనరావు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమములో మహిళ సభ్యులు పాల్గొన్నారు.

