జవాన్లను సన్మానిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్ అధ్యక్షతన శనివారం ఉదయం 11:30 గంటలకు తాళ్లూరి సత్రంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారత జవాన్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వర రావు హాజరయ్యారు. నాయకులతో కలిసి సురపతి కృష్ణారావు దంపతులను, BS రెడ్డి జవాన్ ను ఈ సందర్భంగా సన్మానించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహన్ రావు, సీనియర్ నాయకులు, చింత శ్యామ్ సుందర్ , కొత్త వీరభద్రరావు, అద్దేపల్లి వెంకట్రావు, రేపాక ప్రసాద్, భారతీయ జనతా పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జై జవాన్