దివిలి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు
చిత్రం న్యూస్ , పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో బూత్ నంబర్ 32,33,34 డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు నిర్వహించారు. పెద్దాపురం నియోజవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దివిలి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఊడి శ్రీను, నానేపల్లి రఘు, ఆకుల ఈశ్వరరావు, పోకల రఘు, మాగాపు చందర్రావు, పాలాటి సత్తిబాబు, రెడ్డి శీను, మరికి వెంకటకృష్ణ, బూత్ ఇంచార్జ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.