Chitram news
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 11:12 am Editor : Chitram news

రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పంద్రం శంకర్

రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పద్రం శంకర్

*ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావుతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న జిల్లా అధ్యక్షులు పద్రం శంకర్

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పట్నాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది పద్రం శంకర్ ను ఆదిలాబాద్ జిల్లా రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.  జిల్లా అధ్యక్షులుగా తనకు భాద్యతలు అప్పగించడంతో పద్రం శంకర్ రాజ్ గోండ్ సేవ సమితి స్టీరింగ్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావుతో పాటు జిల్లా అధ్యక్షులుగా తాను ప్రమాణస్వీకారం చేయనున్నట్లు  పద్రం శంకర్ తెలిపారు. తనకు అప్పగించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించి రాజ్ గోండ్ సేవ సమితికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.