పులిమేరు లో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు రెండో రోజు బూత్ నెంబర్ 35, 36 ,37లో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు తెలిపారు. ఆయన వెంట పులిమేరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అవిన్, అశోక్, బూత్ ఇంచార్జ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

