వేదంలో ఘనంగా బోనాల జాతర
వేదంలో ఘనంగా బోనాల జాతర చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ బోనాల జాతరలో అమ్మవారిని అలంకరించిన తీరు అందరిని ఆకర్షించింది. ఇంతే కాకుండా పిల్లలు ధరించిన అమ్మవారి, పోతురాజుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్. బోనాల జాతర మన సాంప్రదాయ పండగని అది ఆషాడమాసంలోనే ఎందుకు జరుపుకుంటామనే విషయం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అమ్మవారి గీతాలను ఆలపించి వాటిపై నృత్యాలను చేశారు....