చిత్రం న్యూస్, బోథ్ : నిర్మల్ నుంచి బోథ్ కు అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేని కారణంగా లారీని బోథ్ పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.