మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ
చిత్రం న్యూస్, బోథ్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ వీరాభిమాని అల్లం మనోహర్ సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవీన్ రెడ్డి, స్టాఫ్ ఆధ్వర్యంలో రోగులకు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అనేక పథకాలు లబ్ది చేకూరాయని , గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అలాంటి వ్యక్తిని మర్చిపోకూడదని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ రెడ్డి,అల్లం మనోహర్, లక్ష్మణ్ యశోద,లింగారెడ్డి, రేణుక, అనసూయ, జమున తదితరులు పాల్గొన్నారు.
