సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న కంది శ్రీనివాస రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రజాసేవ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందించిన వారికి ప్రత్యేక చొరవతో చెక్కులు అందేలా చూస్తామని, ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.