ట్రిపుల్ ఐటీ బాసరకు సామ రేవంత్ రెడ్డి ఎంపిక
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన సామ రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీ బాసరకు ఎంపికయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో శ్రమించిన రేవంత్, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ ప్రతిరోజూ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకున్నాడు. ఈ అవకాశం వృథా చేయకుండా దేశానికి ఉపయోగపడే ఇంజినీరు కావడమే తన ఆశయమని రేవంత్ తెలిపాడు. గ్రామస్తులు, బంధువులు, స్కూల్ ఉపాధ్యాయులు రేవంత్కు అభినందనలు తెలిపారు.