మార్కెట్ చీఫ్ ఇంజినీర్ గణేష్ ను సన్మానిస్తున్న మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సెక్రటరీ విఠల్
చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మార్కెటింగ్ చీఫ్ ఇంజనీర్ గణేష్ అధికారులతో కలిసి కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం రూ. 3.72 కోట్లు ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే పంపిన ప్రతిపాదనలను గురువారం మార్కెట్ యార్డ్ ను సందర్శించిన మార్కెటింగ్ చీఫ్ ఇంజనీర్ గణేష్ కొలతలు చేపట్టిపరిశీలించారాన్నారు. అనంతరం మార్కెటింగ్ చీఫ్ ఇంజనీర్ గణేష్ ను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ విఠల్ తదితరులు ఉన్నారు.