నిత్యవసర సరుకులను డోర్ డెలివరీ చేయడానికి కిట్లు సిద్ధం
చిత్రం న్యూస్ ,పెద్దాపురం: పెద్దాపురం
మిరపకాయల వీధిలో కాకిలేటి అమ్మజీ రేషన్ షాప్ నందు ప్రతినెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటలనుండి 12 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు .65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కోసం రాలేని వయోవృద్ధుల కోసం కిట్లను ఏర్పాటు చేసి డోర్ డెలివరీ చేయడానికి డీలర్ నిత్యవసర సరుకులను సిద్ధం చేశారాన్నారు.