సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు, నాయకులు
చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొని స్వస్థలం పెద్దాపురం వచ్చిన సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం నిర్వహించిన సన్మాన సభలో ఆయన సేవలను కొనియాడారు. సైనికుడు వినోద్ ను ఆయన ఇంటి వరకు బ్యాండ్ మేళాలతో, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.