చిత్రం న్యూస్, ఇచ్చోడ;
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
_పీ హెచ్ సీ వైద్యాధికారి హిమబిందు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ పీ హెచ్ సీ వైద్యాధికారి డా హిమబిందు అన్నారు. మండలంలోని సిరిచెల్మ గ్రామ పంచాయతీ పరిధిలోని నేరేడిగొండ (జి) గ్రామంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మంది బాలింతలు, గర్భవతులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గర్భిణులు, బాలింతలు సీజనల్ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బాలింతలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.