Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక చేయూత 

*రూ.5వేలు ఆర్థిక సాయం అందజేసిన అడా నేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ యువ నాయకుడు సతీష్ పవార్

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మొహబ్బత్ పూర్ గ్రామానికి చెందిన సందీప్ ఠాక్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో  అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్ రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ విపిన్ ఖోడే ద్వారా బాధితుడి పరిస్థితి తెలుసుకున్న సతీష్ పవార్ బుధవారం గ్రామానికి వెళ్లి బాధితుడికి నగదును అందజేశారు .ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపదలో ఉన్నా వాళ్ళని ఆదుకున్నందుకు సతీష్ పవార్ కు విపిన్ ఖోడే ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్న ఓల్లప్ వార్, మాస్కే తేజరావు, గ్రామ మాజీ సర్పంచ్ విపిన్ ఖోడే, విశ్వనాథ్ ఠాక్రే మరియు గ్రామస్థులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments