విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి
*నేరడిగొండ మండలం లింగట్లలో విషాదం
చిత్రం న్యూస్, నేరడిగొండ (ఇచ్చోడ): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన యువరైతు సాబ్లే సుభాష్ తన వ్యవసాయ భూమిలో పత్తి పంటకు కలుపు తీస్తున్న సమయంలో అక్కడే వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలింది. ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. గత కొన్ని నెలల నుండి విద్యుత్ తీగ వేలాడుతున్న విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.