Chitram news
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 4:28 pm Editor : Chitram news

మరిడమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప

 

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా జిల్లా పెద్దాపురం  మరిడమ్మ అమ్మవారి జాతరను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ముప్పై ఏడు రోజుల పాటు జరగనున్న  ఈ జాతరకుఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు అధికంగా భక్తులు తరలివస్తారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తిచేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, ఆలయ ఈవో విజయలక్ష్మి ఉన్నారు.