టీడీపీతోనే బీసీల ఆత్మ గౌరవం పెంపు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితని సన్మానిస్తున్న దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు చిత్రం న్యూస్, అమరావతి: వెనుబడిన తరగతుల ఆత్మగౌరవం పెంపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలు గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే భిక్షాటన చేసేవారు అనే పదాన్ని తొలగింపు హర్షం వ్యక్తంచేస్తూ.. మంత్రి సవితకు...