జై బాపు ..జై భీం..జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన జై బాపు ..జై భీం..జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.9 రోజుల్లో 9వేలకోట్ల పైచిలుకు రైతు భరోసా కింద్ర రైతుల ఖాతాల్లో జమ చేశాం..మొత్తం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో పేదలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 16 న రైతు భరోసా నిధులు విడుదల ప్రారంభించాం. 24 న పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి,, మంత్రులు అందరూ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ వద్ద నుండి రైతు వేదికల్లో ఉన్న రైతులకు సందేశం ఇస్తారన్నారు.ఈనెల 24 న మండల పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని సూచించారు.