సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం.
చిత్రం న్యూస్, శంకరపట్నం: సెయింట్ థామస్ పాఠశాలలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ & ప్రిన్సిపాల్ ఫాదర్ శరన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు యోగాతో ఏకాగ్రత సాధించవచ్చని అన్నారు. యోగాతో మనసు, శరీరంపై పట్టు సాధించి ఏకాగ్రత సాధించవచ్చునని తెలుపుతూ విద్యార్థులు ప్రతిరోజు కొంతసేపు యోగాకు సమయం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల పి.టి శివానంద రెడ్డి విద్యార్థులకు యోగాసనాలు త్రికోణాశనం, పాదాస్థానం, చంద్రాసనం ,ప్రాణాయామం, ధ్యానం మొదలైన వాటిపై విద్యార్థుల చేత చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.