విశాఖ సముద్ర తీరాన ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
*మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఒక్క యోగా వల్లనే సాధ్యం
*ముఖ్యమంత్రి నాయకత్వంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవం గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించడం మంచి శుభపరిణామం
*మంత్రి కొలుసు పార్థసారధి*
చిత్రం న్యూస్, నూజివీడు:నిత్య జీవితంలో యోగా అనుసరణే ఆరోగ్య భద్రతకు మానవుని ఆధారమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శనివారం విశాఖ సముద్ర తీరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విశాఖ తీరంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యోగా నిత్య సాధన వల్ల కలిగే మానసిక, శారీరక లాభాలు ప్రజలకు విస్తృతంగా తెలిసేలా చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజల నిత్య జీవితంలో యోగా ఒక భాగం అయినప్పుడు ప్రజల ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుందన్నారు, యోగా మన దేశ సంప్రదాయమని మన పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తి అని అన్నారు, ఈ కళను నేటి తరానికి భావి తరానికి అందించాలన్నారు, తద్వారా ఆరోగ్యఆంధ్ర,, ఆరోగ్య భారత్ సాధ్యమన్నారు .పాశ్చత్య ,ఆధునిక ప్రపంచంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం యోగా వల్లనే సాధ్యం అన్నారు. మన నిత్య జీవితంలో యోగా ఒక భాగం అయినప్పుడు ప్రతీ ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తారన్నారు, యోగా వలన సమాజంలో అల్లర్లు, గొడవలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 3.5 లక్షల మంది ఏకమై యోగా చేసిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు,తెలుగుదేశం నాయకులు, రఘు, మధు, రమణ, ఆది, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు