కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం
*శక్తి కేంద్రం ఇన్చార్జి రసమల శ్రీనివాస్
చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో వికసిత్ భారత్ అమృత కాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా మండలంలోని కరీంపేట శక్తి కేంద్రం పరిధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఎస్టీ మోర్చ మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జి రాసమల శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపి శ్రీనివాస్,నాయకులు మెడిశెట్టి రాజేష్, రొడ్డ స్వామి, మెడిశెట్టి రాకేష్, నాంపల్లి అజయ్, గుర్రం సదానందం, గంపల శివాజీ, చింతం రాజు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.