గట్టు తిరుపతి గౌడ్ ఉదారత
*కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేత
చిత్రం న్యూస్, శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన లింబాద్రి అనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కు ఇటీవల ప్రమాదం జరిగింది. దీనితో చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్ బాధితుని ఇంటికి చేరుకొని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందజే5సి తన ఉదారతను చాటుకున్నాడు. ఈ సందర్భంగా లింబాద్రి గట్టు తిరుపతి గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు