Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

పెద్దాపురం బీ జే పీ కార్యాలయంలో మొక్కలు నాటిన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ 

పెద్దాపురం బీ జే పీ కార్యాలయంలో మొక్కలు నాటిన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ 

చిత్రం న్యూస్, పెద్దాపురం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా  పెద్దాపురం బిజెపి నియోజకవర్గ కార్యాలయం లో విశ్వ పర్యావరణ్ దివస్  కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి  పర్యావరణాన్ని కాపాడుకోవాలని కాలుష్య రహిత భారత దేశం కోసం పోరాడాలని, తద్వారా రాబోయే భావితరాలకు మేలు చేకూరుతుందన్నారు.  జూన్ 21 న నిర్వహించే “యోగ డే ” కార్యక్రమానికి అందరు హాజరై యోగ ప్రయోజనాలను తెలుకుని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో  శ్రీమన్నారాయణ, దయాకర్ రెడ్డి, బీజెపీ జోనల్ ఇంచార్జ్ కాశీవిశ్వనాధ్ , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బీజెపీ మాజీ జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య ,  కాకినాడ బీజెపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు , పెద్దాపురం నియోజకవర్గ కార్యక్రమ ఇంచార్జ్ గోరకపూడి చిన్నయ్య దొర , స్టేట్ కౌన్సిల్ మెంబెర్ దుర్గా మోహనరావు, పెద్దాపురం పట్టణ అధ్యక్షులు బోలిశెట్టి రాంకుమార్, ప్రధాన కార్యదర్శి నలమాటి సురేష్ కుమార్, ఉపాధ్యక్షులు కాకి భార్గవి, ఉపాధ్యక్షులు చెలిపోయిన రత్నం, ఉపాధ్యక్షులు ఉప్పల నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు, కొత్త వీర భద్రరావు, ఉపాధ్యక్షులు దేవడ శ్రీను, పెద్దాపురం రూరల్ బిజెపి అధ్యక్షులు పోతుల ప్రభాకర్, సామర్లకోట పట్టణ అధ్యక్షులు పుప్పాల నాగ గోవిందు, ప్రధాన కార్యదర్శి జానీ మొజెస్, చుక్క వెంకటరమణ, ( కార్యదర్శి) దిమ్మలా విజయ లక్ష్మి( ఉపాధ్యక్షులు), కోన రాంబాబు ( ఉపాధ్యక్షులు), సామర్లకోట రూరల్ ఉపాధ్యక్షులు కంచు మర్తి శ్రీను, బక్కి విజయ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img