Chitram news
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 1:17 pm Editor : Chitram news

సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

చిత్రం న్యూస్ ,పెద్దాపురం: సంస్థాగత ఎన్నికల లక్ష్యంగా పార్టీ బలోపేతం  దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు చిట్టూరి శ్రీనివాసరావు, వాడ్రేవు వీరబాబులు ఆన్నారు. పెద్దాపురం ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం, సామర్లకోట బడుగు శ్రీకాంత్ ఆఫీస్, పెద్దాపురం రాజా సూరిబాబు రాజు ఇంటి దగ్గర జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ లో పాల్గొని నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి పార్టీ అధిష్టానానికి నివేదిక తయారు చేసి తీర్మానాలు పంపించారు. కూటమి  ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతం గా ప్రజల ముందుకు తీసుకు వెళ్ళాలన్నారు. ఈ సమావేశంలో  పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు బోళ్ళ వెంకటరమణ, రాజోలు నియోజకవర్గం టీడీపీ వాణిజ్య విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి ఆయా మండల, నియోజక వర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.