Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

లక్కవరంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ

లక్కవరంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ 

చిత్రం న్యూస్, జంగారెడ్డిగూడెం, రూరల్: పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కూటమి నాయకులు అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూటమి నాయకుల చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో 9 రకాల వస్తువులతో కిట్లు పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. అదే విధంగా సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందించడం తో విద్యార్థుల తల్లిదండ్రులలో మరింత ఆనందం కనిపిస్తుందని అన్నారు .ఈ కార్యక్రమంలో హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img