బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ముడుపు మౌనిష్ రెడ్డి
* జైనథ్, బేల మండలాల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ
*ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున 25 వేలు అందజేత
చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్, బేల మండలాల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున ఐదుగురికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేశారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు తరోడ వాగులో కొట్టుకుపోయి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. సాంగ్వి (కే) గ్రామంలో కరెంట్ షాక్ తో మృతి చెందిన బోయర్ దామోదర్ కుటుంబ సభ్యులను, అనారోగ్యం కారణంగా మృతి చెందిన బావునే గంగారాం కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికీ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల పిడుగుపాటుకు గురై మరణించిన బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన నందిని కుటుంబ సభ్యులను, సోన్ ఖాస్ గ్రామానికి చెందిన కోవా సునీత కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారి వెంట మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, నరేష్, అనిల్, రామాజీ, విలాస్, సాయి కిరణ్ రెడ్డి, సంజయ్ గుండావార్, సచిన్, బాపురావు, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, దినేష్, శ్రీకాంత్,సాయి, అతర్వ తదితరులు ఉన్నారు.