Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

పిల్లల చదువుకు ” తల్లికి వందనం “

పిల్లల చదువుకు ” తల్లికి వందనం “

*ఒకే కుటుంబంలో రూ.75 వేలు నగదు ఖాతాలో జమ

*పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప

చిత్రం న్యూస్, సామర్లకోట: పిల్లల చదువుకు ” తల్లికి వందనం ” డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  ఆయన మాట్లాడుతూ..కాకినాడ జిల్లా సామర్లకోట టౌన్ లో భాస్కర్ కాలనీలో 31వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీకి చెందిన కుటుంబంలో  ఐదుగురు పిల్లలకు తల్లికి వందనం కింద రూ. 75 వేలు నగదును ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం  కార్యక్రమంతో తమ పిల్లలకు చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి,  సామర్లకోట టౌన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img