Chitram news
Newspaper Banner
Date of Publish : 13 June 2025, 3:32 pm Editor : Chitram news

అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి.. డబ్బులు పడతాయి

అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి..డబ్బులు పడతాయి

*మంత్రి నారా లోకేష్

చిత్రం న్యూస్, అమరావతి: అర్హులందరికీ ‘తల్లికి వందనం’ డబ్బులు జమ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మంది పిల్లలకే అమ్మఒడి ఇస్తే మేం 67 లక్షల మందికి ఇస్తున్నాం. కొంతమంది అకౌంట్లు యాక్టివేట్ లేక నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయి. అలాంటి తల్లులు బ్యాంకులకు వెళ్లి ఖాతాలు యాక్టివేట్ చేసుకుంటే డబ్బులు పడతాయి’ అని లోకేశ్ సూచించారు.