వికసిత్ భారత్ కి పునాది
*కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
చిత్రం న్యూస్, కాకినాడ: ప్రధాని మోదీ 11 సంవత్సరాల పరిపాలనలో విజయాలను అలాగే గణనీయమైన పరివర్తన తీసుకువచ్చాయని అధికార పరిరక్షణ నుండి పనితీరు జవాబుదారీతనం వరకు ప్రతిదీ సుపరిపాలన అని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. గురువారం పైడా చలమయ్య కళ్యాణ మండపంలో ప్రధాని మోదీ 11ఏళ్ల పరిపాలనపై నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రజల నేతృత్వంలోనిదని పారదర్శకత భవిష్యత్ విధానానికి కట్టుబడి ఉందన్నారు. వికసిత్ భారత్ కు పునాది వేయబడిందని, భారతదేశానికి అమృతకాలం సేవ అని కొనియాడారు. అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలను ఎగ్జిబిషన్ గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు.