బేల మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలో గురువారం రెండు చోట్ల పిడుగుపడడంతో ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సాంగిడి గ్రామంలో పిడుగు పాటుకు చేనులో పనులు చేస్తున్న మహిళ గెడం నందిని మృతిచెందగా మరో మహిళకు గాయాలయ్యాయి. ఇదే మండలంలోని సోన్ కాస్ గ్రామంలో పిడుగు పడటంతో పొలంలో పని చేస్తున్న మరో మహిళ సునీత మృతి చెందారు.