బీరప్ప జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలి
_గుడిసె పోచయ్య పెద్ద కురుమ
చిత్రం న్యూస్, శంకరపట్నం: బీరప్ప జాతరను ప్రశాంతంగా ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను చేస్తున్నట్లు పెద్ద కురుమ కుల గుడిసె పోచయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని అంబల్పూర్ గ్రామంలో శ్రీ బీరప్ప ఆలయ జాతర ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివస్తారు. ఈ సందర్భంగా గుడిసె పోచయ్య పెద్ద కురుమ నుశాలువతో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీరప్ప జాతర వైభవంగా జరగనున్నట్లు ఆయన తెలిపారు. కురుమ యూత్ నాయకుడు గుడిసె సుమన్ మాట్లాడుతూ ..ఐక్యంగా జాతరను జరుపుకోవాలని అన్నారు. గోస్కుల లింగమూర్తి మాట్లాడుతూ.. బీరప్ప జాతరను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అన్నారు. మాజీ పెద్ద కురుమ గుడిసె కొమురయ్య మాట్లాడుతూ.. బీరప్ప జాతరను సమర్ధవంతంగా కుల సభ్యులు అందరూ సఖ్యతగా ఉండేలా చూడాలని అన్నారు. (కురుమ కుల నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నిక ) అంబల్పూర్ కుల కురుమ నాయకుడిగా గుడిసె పోచయ్య కురుమ ఏకగ్రీవంగా బుధవారం నాడు 49 మంది సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల గురువులు కురుమ కులస్తులంతా 49 సభ్యులు పాల్గొన్నారు.