దుగోడ మిషన్ లో చేయి ఇరికి వ్యక్తికి గాయాలు
*శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఘటన
చిత్రం న్యూస్, శంకరపట్నం: దుగోడ మిషన్ లో చేయి ఇరికి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో చోటుచసుకుంది. గ్రామానికి చెందిన ముతోజు శ్రీనివాస్ (40) రోజువారి పనిలో భాగంగా బుధవారం దుగోడ మిషన్ తో పనిచేస్తుండగా అకస్మాత్తుగా శ్రీనివాస్ కుడి చేయి దుగోడ మిషన్లో ఇరుక్కుపోవడంతో కుడి చేయి బొటనవేలు నుజ్జు నుజ్జు అయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయడంతో ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీలుల్లా సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. క్షతగాత్రుని అంబులెన్స్ లో తీసుకొని కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కు తరలించారు.