జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి
*చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
చిత్రం న్యూస్, చింతలపూడి: APWJF చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చింతలపూడిలో చింతలపూడి ఎంఎల్ఏ సొంగా రోషన్ కుమార్ ని వారి కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు , జర్నలిస్టులకు పెన్షన్ , అక్రిడిటెషన్ కమిటీల్లో మీడియా కమిటీ, ప్రతినిధులకు ప్రాతినిధ్యం, జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు, మీడియా అకాడమీ బలోపేతం చేయడం, ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు అవార్డులు అందజేయడం, ర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, భీమా సదుపాయం ఏర్పాటు , జర్నలిస్టులకు ఆరోగ్య భీమా, జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాట్ల తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో APWJF ఏలూరు జిల్లా కోశాధికారి కె. నాగ చిన్నారావు, సంయుక్త కార్యదర్శి ఎం. రవి, కె. రజనీకాంత్, టి. సంజయ్, టి. బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.