Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

ప్రజా సంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వానికి గీటురాళ్లు

ప్రజా సంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వానికి గీటురాళ్లు

*ఎమ్మెల్యే బడేటి చంటి

చిత్రం న్యూస్, ఏలూరు:రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు, ప్రజాసంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వ పాలనకు గీటురాళ్ళని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయ్యింది. ఈ ఏడాదిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ వచ్చామన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని నందమూరి తారక రామారావు మున్సిపల్‌ పార్క్‌ వద్ద నిర్మించిన అభివృద్ధి ఫైలాన్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. సుమారు రూ. 12.45 కోట్ల రూపాయల భారీ నిధులతో 120 అభివృద్ధి పనులను అమలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇదేక్రమంలో రానున్న కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌, డిప్యూటి మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img